This slideshow requires JavaScript.

This slideshow requires JavaScript.

EFLU students, who had represented EFLU in various international forums to present their research papers

http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/article2833396.ece

The Hindu : NATIONAL / ANDHRA PRADESH : ‘Critical Editions’ of 14 books launched at EFLU

The Hindu : NATIONAL / ANDHRA PRADESH : ‘Critical Editions’ of 14 books launched at EFLU.

ఆంధ్రజ్యోతివారికి శ్రీలక్ష్మీతో లవ్ ఫైయిల్యూరా???

Reblogged from సామాన్యుడు * common man:

గత ఆరునెలలుగా చూస్తున్నా…ఆంద్రజ్యోతి పేపర్లో ప్రతిరోజూ ప్రధాన వార్తగా ముందుపేజీలో లేకపోతే ఎక్కడో ఓ చోట ఆమె ఫోటోతో కూడిన వార్త రాయకుండా లేరు. ఆమె ఒక్కతే ఈ కుంభకోణమంతటికీ కారణంలా ఆమెనే ఎక్స్పోజ్ చేస్తూ వస్తుంటే ఈ సందేహమొచ్చింది. రాజకీయ నాయకుల వత్తిడులకు లోను కాని అధికారులెవరైనా వున్నారా? పోనీ వత్తిడి చేయని రాజకీయనాయకులున్నారా?? తెలుగుదేశం పాలనా కాలంలో జరిగిన ఏలేరు కుంభకోణంలో పాల్గొన్న అధికారులు లేరా?? ఎన్నో అవకతవకలను కప్పిపుచ్చేస్తూ అధికారులు రాజకీయ నాయకులతో అంటకాగడం ఈ దేశ ప్రజల దౌర్భాగ్యం. ఒక్క శ్రీలక్ష్మితోనే మొదలు కాలేదు..తుదీ కాలేదు. మరి ఆంధ్రజ్యోతికి ఎందుకీ కక్ష ఆమెపై.. దేవాలయానికి వెళ్ళినా వెంటపడి అక్కడా వ్యంగ్యంగా రాతలు. జైల్లో భర్త కలిసినా వార్త. ఆమె తోటి ఖైదీలతో మాటాడినా వార్త. అసలు ఈ పత్రిక వార్తలు మరచి కథనాలు రాస్తూంది అన్నది నిజం కాదా?? ఒక మహిళ పట్ల ఈ రకమైన ప్రవర్తన కలిగి వుండటం ఏ జర్నలిజం. ఆమె తప్పు చేసినట్టు నిరూపితమైతే శిక్ష అనుభవిస్తుంది. ప్రస్తుతం జైల్లోనే రిమాండ్ లో వున్నారు కదా?? ఇంక మీ కథనాలతో ఆమె వ్యక్తిగత జీవితాన్ని నాశనం చేయడం సమంజసమా??

2011 in review

The WordPress.com stats helper monkeys prepared a 2011 annual report for this blog.

Here’s an excerpt:

A San Francisco cable car holds 60 people. This blog was viewed about 2,700 times in 2011. If it were a cable car, it would take about 45 trips to carry that many people.

Click here to see the complete report.

మరాండీ శిక్ష చేస్తున్న హెచ్చరిక!

హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంవూదంలో ‘ఉరిశిక్షల రద్దు పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభ చాలా ఉత్తేజకరంగా జరిగింది. వర్షంలో ఎవరు వస్తారులే అనుకుంటూ సమావేశానికి బయలుదేరాను. జోరున వర్షం కురుస్తున్నా సభ జరుగుతున్న హాల్ కిక్కిరిసిపోయింది. ఎందుకో రాజ్యం ఇంత కసాయిగా ఉన్నా ‘పోరాడితే పోయేదేమీ లేదన్నట్లు’ .. ఆ సమావేశానికి వచ్చి న సంఖ్య చూస్తే చాలా ఆశ కలిగింది. దాదాపు నాలుగు ఏళ్ల కింద ట జార్ఖండ్ ముఖ్యమంత్రి బాబులాల్ మరాం డి కుమారుడి మీద జరిగిన దాడిలో అతని కొడుకుతో పాటు మరి కొంతమంది మరణించారనే అభియోగంతో, ఆ దాడిలో పాల్గొన్నారని ఛత్రపతిమండల్, మనోజ్ రజ్వార్, అనిల్ రాం, జీతన్ మరాండీలకు ఉరి శిక్ష పడింది. దీనికి నిరసనగా జరిగిన సభకు వరవరరావు, గద్దర్, బీడీ శర్మ, విప్లవ కవి శివాడ్డి, జీతన్ మరాండీ సహచరి అపర్ణా మరాండీ, విస్తాపన విరోధ్ మంచ్ ప్రతినిధి వినోద్ తదితరులు హాజరయ్యారు. హాల్ అంతా నిండిపోయింది.

ఈ మధ్య అంత పెద్దసంఖ్యలో అందునా జోరున వర్షం కురుస్తున్నా హాజరవడం బహుశా ఇదే మొదటిసారేమో. లోపల ఎంతమంది ఉన్నారో అంతమంది, లోపల చోటులేక బయ నిలబడ్డారు. కూర్చోవడానికి సీట్ వెతుక్కోవడానికి చాలా కష్టపడ్డాను. తన ఏడాది కొడుకునెత్తుకొని కళ్లలో అంతులేని ఆశతో భవిష్యత్తుమీద అచంచలమైన భరోసాతో శత్రువుమీద దూకడానికి సిద్ధంగా ఉన్న సివంగి లా అపర్ణా మరాండి కనిపించింది. నా సీట్ పక్కనే తన కొడుకుని ఎత్తుకొని ఒళ్లో పెట్టుకొని అమాయకంగా కూర్చొంది. మన నిర్వాహకుల తెలుగు ప్రసంగాలు అర్థంగాక నన్ను పిలిచారా లేదా అనే ఆమె తొట్రుపాటు గమనించాను. చాలా సాదా సీదాగా, ఎముకల గూడులా ఉన్న ఆమెను చూస్తే అంత గొప్ప కళాకారిణిగా అనిపించదు. ఆమె మీద నాకు గౌరవం పెరిగింది.

అదే సందర్భంలో.. పాట అంగట్లో అమ్మకపు సరుకై, ఎలక్షిక్టానిక్ మీడి యా యజమానుల దగ్గర ఆత్మాభిమానాన్ని అమ్ముకుంటున్న కొంతమందిని చూస్తేజాలి వేసింది. జీతన్ మరాండీ ఈరోజు ఎందుకు ఉరికంబానికి ఎక్కుతున్నాడు?ఎందుకంటే.. ప్రజల నోటికాడి కూడు, నీడ దోచుకుంటున్న దోపి డీ శక్తుల గుట్టు బయట పెట్టినందుకే అపర్ణా మరాండీ సహచరుడు ఉరికంబం ఎక్కాల్సి వచ్చిం ది. ఎప్పటి నుంచి ఈ పరంపర మొదలయ్యిం ది? వాళ్లు లాహోర్ కుట్రకేసులో పాల్గొన్న వాళ్లు కావచ్చు. అంతర్జాతీయ ఆయిల్ మాఫియా ‘షెల్’ కంపె నీ దురాగతాలకు ఉరికంబమెక్కిన కేంసారో వివా కావచ్చు. అమెరికన్ సామ్రాజ్యవాదులు బలిగొన్న సక్కో వాంజెట్టీ కావచ్చు. తెలంగాణ జైత్రయాత్ర భూమిపువూతులు భూమ య్య, కిష్టాగౌడ్ కావచ్చు. నేడు నేను కావ చ్చు. రేపు మీరూ కావచ్చు. ఇలా రాజ్యహింసలో ఎందరో బలయిపో యారు.

ఇంకా ఎంతకాలం ఈ మానవ హననాలు? ఈ ప్రశ్నలు ముప్పిరిగా నా మనసులో తొలుస్తున్నాయ్. ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం చేసిన కసాయి తనం ఆమె కళ్లల్లో కన్పించింది. ఆమె చేతుల్లో ఉన్న ఏడాది వయసు బిడ్డను ఎత్తుకొని వాణ్ణి నిద్రపుచ్చుతూ తోటి కళాకారుల గజ్జెల సవ్వడి చూసి ఊగిపోయింది. తనూ, తన సహచరుడు ఆ గజ్జెలతో ఎన్ని వందల ఊళ్లను మేల్కొలిపి ఉంటా రు? ఇంకొన్ని రోజుల్లో తన కొడుకు తండ్రి లేని అనాథ అయినా తన కొడుకులా మరే కొడు కూ నీడలేని వాడు కావద్దని దేశమంతా సంచారిలా తిరుగుతోం ది. అందరినీ సంఘటితం చేసే పనిలో ఉందామె. రాజ్యం కత్తుల వంతెన మీద సవారి చేస్తున్న ఆమెను చూస్తే ఆపాటి త్యాగంలో ఒక పైసా వంతు అయినా ఈ దేశ మేధో వికాసవంతులు చేస్తున్నారా? అనిపించింది. ప్రశ్నించే వాళ్లను అభివృద్ధి నిరోధకులని లక్షల రూపాయలు ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న వాళ్లు, బహుళజాతి కంపెనీల మోచేతి నీళ్లు తాగే ఎన్‌జీఓలు పిల్లి కూతలు కూస్తున్నారు. ఆమె ప్రసంగాన్ని విశ్వవిద్యాలయంలో ఉన్న కుహ నా మేధావులతో గోడ కుర్చీ వేయించి వినిపించాలని పించింది. ‘అంతర్జాతీయ విపణిలో భారతమాత అంగాంగం తాకట్టు పెట్టబడుతోంది’ అని ప్రజాకవి చెరబండ రాజు చెప్పిన విషయాన్ని అపర్ణ మరాండీ అంటూంటే.. గర్వపడ్డాను. జాతీయ, అంతర్జాతీయ దోపిడీ దారులు వందల ఏళ్లుగా సమస్త వనరులను దోచుకున్నారు.

నేడు వాళ్ల దృష్టి భూమి అడుగున ఉన్న విలువైన బాకె్సైట్ మీద పడ్డది. దానికి అక్కడ ఉన్న ఆదివాసులు అడ్డుగా ఉన్నారని వాళ్లను భౌతికంగా నిర్మూలించడానికి సిద్ధమయ్యారు. ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరుతో ఆదివాసీ గిరిజనులపై యుద్ధానికి సిద్ధమయ్యారు. మానవరహిత విమానాలతో యుద్ధసన్నాహాలు చేస్తున్నారు. జార్ఖండ్ నుంచి వచ్చిన ‘విస్తాపన్ విరోధి మంచ్’, జీతన్ మరాండీ ప్రాతినిధ్యం వహిస్తున్న ‘అభేన్ సాంస్కృతిక సంస్థ’ నుంచి మాట్లాడుతూ ఛత్తీస్‌గఢ్ జార్ఖండ్ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఫాసిస్ట్ విధానాలను దుయ్యబట్టారు. చూస్తే అమాయకంగా కనిపించిన అపర్ణా మరాండీ జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడి దారులు జల్, జమీన్, జంగిల్ మీద ఆదివాసీలకు కనీసం హక్కులేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఖనిజాల తవ్వకం కోసం ఆదివాసులను అక్కడినుంచి తరిమేసే పనిలో ఉన్నారని, దాన్ని ప్రశ్నించిన వాళ్లను దేశ ద్రోహులుగా ముద్ర వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గజ్జె కట్టి పాటపాడే ఆదివాసుల మీద , వాళ్ల కలాల మీద, గళాల మీద ఆంక్షలు ఆక్షేపణీయమని అన్నారు. జిందాల్, మిట్టల్, అభిజిత్ లాంటి సంస్థ లు మైనింగ్ మాఫియా అవతారమెత్తి లక్షలాది మంది ఆదివాసులను నిర్వాసితుల్ని చేస్తున్నాయని అపర్ణా మరాండీ తెలిపారు.

ఈ క్రమంలో వందలాదిమంది చనిపోయారని, ఎంతో మంది కనిపించకుండాపోయారని ఆమె వాపోయారు. ప్రశ్నించిన కళాకారుల కు ఉరిశిక్షలు వేస్తున్నారని, ఇవాళ తన సహచరుడు జీతన్ మరాండీ కూడా ఆ కుట్రకు బలయ్యారని తెలిపారు. ఇది వ్యక్తిగతంగా జీతన్ మరాండీ మీద పెట్టిన కేసు, వేసిన ఉరి శిక్షగా అనుకోవడం లేదనీ, ఇది ఆదివాసీ ఉద్యమాలను అంతం చేయడానికి మైనింగ్ మాఫియా చేసిన దాడిగా చూడాలని పిలుపునిచ్చారు. వందల ఏళ్లుగా ఆదివాసులు అటవీ సంపద హక్కు భుక్తంగా చేసుకొని బతుకుతున్నారు. నేడు వాళ్ల ఉనికికే ప్రమాదం వచ్చిందని అన్నారు. ఇవ్వాళ దేశంలోని బుద్ధిజీవులంతా.. మైనింగ్ మాఫియా, బహుళజాతి కంపెనీల దోపిడీని ప్రశ్నించి ఎదిరించకుంటే.. అందరికీ ఉరితాడే మిగులుతుందని హెచ్చరించారు. ఇవ్వాళ భారత ప్రభుత్వానికి ఈ నేల వాసుల ప్రయోజనా ల కన్నా మైనింగ్ మాఫియా ప్రయోజనాలే ముఖ్యమని దానికి వ్యతిరేకం గా దేశంలోని ప్రజాస్వామికవాదు లు, మేధావులు సంఘటితంగా ఐక్య ఉద్యమాలు తీవ్రతరం చేయాలని అపర్ణా మరాండీ కోరారు. ఉరి శిక్షల రద్దు కోసం జాతీయంగా, అంతర్జాతీయం గా వ్యతిరేకత వ్యక్తమవుతున్నా, అమానవీయమని అంటున్నా.. మన ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయని విమర్శించారు.

నేడు దేశం లో వందలమంది ఈ ప్రాంత విమిక్తి కోసం ప్రాణాలు అర్పిస్తున్నారు ఆ  క్రమం లో శత్రు నిర్భందాలకు  గురి అవుతున్నారు , అది మొన్న శ్రీకాకుళం కావచ్చు  నేడు  , బస్తర్ , నల్లమల , నందిగ్రాం , జంగల్ మహల్ ,  దంతే వాడ  కావచ్చు  జనతన సర్కార్ కావచ్చు తాము  ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు  తమను ప్రాజెక్టుల పేరుతొ అభివృద్ధి  పేరుతొ  సమస్త సంపదను  దోచుకొనే క్రమంలో ఇనుము తో  నీళ్ళతో, అటవీ సంపదతో  రాజకీయాలుచేసి వాళ్ళను ముంచే పని లో  భూమి లోపల దాగి ఉన్న  లక్షల కోట్ల రూపాయల విలువ చేసే ఖనిజ సంపదను  దోచుకొనే పనిలో ఉన్నారు ఇది అన్యాయమని  ప్రశ్నించిన  మరాండీ లాంటి మిత్రుల ప్రాణాలు హరించే పనిలో ఉన్నారు నేడు అంతర్జాతీయ  పెట్టుబడీ దారుల  ప్రయోజనాలే  లక్ష్యం గా  దోపిడీ కి దారులు  పరుస్తున్నారు . ఈ సహస్రాబ్ది  చివరి అంకంలో     నేడు జీతెన్ మరాండి అనే ఒక యోధుడు పుట్టినా పుట్టకున్నా మరణించినా  మరణించ క పోయినా , ఈ కాలంలో ఇప్పటికంటే మెరు గయిన సమాజాన్ని  కల గనే క్రమంలో  మొదట వరసలో ఉంటాడు ఎదుకంటే అతను అందరిలా బ్రతకాలను కోలేదు ఇక్కడ దోపిడీ పీడన లేని సమాజంలో  అపర్ణా మరాండి తన కొడుకు లాంటి వందలాది మంది వాళ్లకు మెరుగయిన పరిస్తుతులు కల్పించాలనుకున్నాడు  అందుకే కాలుకు బలపం కట్టుకొని అడివంతా తిరిగాడు అటవీ సంపదను కపాడాలనుకున్నాడు ఆ క్రమంలో కుటుంబానికి దూరం అయినాడు.  అతని పైన రాజ్యం కన్నెర్ర చేసింది . అగో అందుకే తన సహచరుల లాంటి వందలాది మంది ని కాపాడుకోవాలని పిలుపు నిస్తోంది .అప్రనా మరాండి . బ్రిటీష్ వాడి కలం లో వచ్చిన ఇలాంటి నల్ల చటాలకు  వ్యతిరేకంగా మనమంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు

ఇలా అనాగారీకమయిన  మధ్య యుగాల కాలం లో అమలు పరచిన అమానవీయ ఉరి చట్టాలనుమ నేడు  ప్రపంచ వ్యాప్తంగా రద్దు చేసిన వైనాన్ని గుర్తు చేసారు  ఆ క్రమంలో  తమిళనాడులో రాజీవ్ హంతకులకు ఉరిశిక్ష రద్దు చేయాలని అక్కడి అసెంబ్లీ తీర్మానం చేయడం ఆహ్వానించదగిందని అన్నారు. మరి మనమిక్కడ ఏం చేస్తున్నాం. ‘సామాన్యుల్ని శవాలుగామార్చి, పోలీసులు మిలిటరీ సాయంతో ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో జులుం, జబర్ దస్తీలే న్యాయం, ధర్మం అని బుకాయించి, దబాయించి అధికారం చెలాయిస్తుంటే మేధావులు, ప్రజాస్వామ్య పరిరక్షకులు, విద్యార్థులు అంతా ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? లేక భయానికి తలొంచుకుంటున్నారా?’ అని రావిశాస్త్రి ఎప్పుడో ఇందిరమ్మ అత్యవసర పరిస్థితుల్లో అన్నారు. సరిగ్గా ఇవ్వాళ తెలంగాణలో ప్రతిరోజూ పరిస్థితి ఎమ్జన్సీని తలపిస్తోంది. నేడు తెలంగాణ కూడా అంతరంగిక భద్రతా చట్టంలోకి మారిపోనుందా..? ఏమో??

-గుర్రం సీతారాములు
రీసెర్చ్ స్కాలర్

http://www.epaper.namasthetelangaana.com/Details.aspx?id=20009&boxid=97782464

http://www.epaper.namasthetelangaana.com/Details.aspx?id=20009&boxid=97782464.

అవకాశ వాద ఒప్పందాలు తెలంగాణా

ప్రతేక తెలంగాణా ఉద్యమనం నేడు అందరు అనుకున్నట్లు తుది దశకు చేరిందని బావించినా  వాస్తవానికి  అది కోస్తాంద్ర  పెట్టుబడి దారులతో మమేకమయిన అంతర్జాతీయ పెట్టుబడి దారులు వాళ్ళ దోపిడీకి తలుపులు బార్లా తెరిచి ఉంచిన యూపీఏ    కబంద హస్తాలలో బిక్కు బిక్కు మంటోంది దోపిడీ శక్తులన్నే ఎలాగయినా దీన్ని రూపు మాపాలని రాజీనామాల నాటకానికి  తెర దీసింది. అందరు అనుకున్నట్లు  రాజకీయ శూన్యత తెచ్చినట్లయితే  కేంద్రం దిగి వస్తది అని భావించిన తెలంగాణా వాదులకు ఇది ఆశనిపాతం .    ఒకరకంగా చెప్పాలంటే   జాతీయ రాజకీయ అడ్డంకుల కంటే అంతర్జాతీయ  కార్పోరేట్ లాబీనే  తెలంగాణాను  అడ్డుకుంటోంది. దీనికి ప్రదాన కారణం ఈ రాష్ట్ర పెట్టుబడి దారి వర్గం మరియు పాలక వర్గం ఒకటి కావడమే . అందునా కోస్తాంద్ర పెట్టుబడి దారులు కేంద్రం లో పార్ల మెంటరీ రాజకీయాలను శాసించే శక్తులు కావడమే కారణ. దీని వలన రేపు తెలంగాణా వచ్చినా పెట్టుబడీ దారి వర్గ ఆకాంక్షలకు  అనుగుణం గానే ఉంటది .  ఈ క్రమంలో ప్రజా ప్రతినిదుల   రాజీనామా ఒక నిరసన రూపం అయినప్పటికీ  విశాల ప్రజానీకం ప్రజా సంఘాలు విద్యార్థులతో ఐక్య ఉద్యమాలు నిర్మించడం లో అన్ని వర్గాల శక్తులు వైఫల్యం చెందాయి .   కేంద్ర ప్రకటన  కేవలం రాజీనామాల ద్వారానే వచ్చేతట్లయితే   ఈ పాటికి ఎప్పుడో అది వచ్చిఉండాలి   ఇంతమంది ప్రజా ప్రతినిధులు రాజీనామాలు చేసినా ప్రక్రియ ముందుకు సాగటం లేదంటే దీని వెనుక లోపాన్ని  లోతుగా చర్చించాల్సిన  అవసరం ఉంది. తెలంగాణా ఉద్యమం విశాల ప్రజా ఉద్యమం గా మారినా విజయం వైపు ఎందుకు  ప్రయాణించడం లేదు అనేది కూలంకుశం గా చర్చించాల్సిన  అవసరం ఉంధీ.    ఎందుకంటె ఇక్కడ రాజీనామాలు  చేసిన ప్రజా ప్రతినిధులు  సాంకేతికంగా కొందరు ఇంకా  మంత్రులుగా ఉన్నట్లే  దీనికి కారణం  రాజీనామాలు అధిష్టానం   కనుసన్నలలోనే జరిగినవి అనే అనుమానం రాక మానదు.  దీని ద్వారా పచ్చి తెలంగాణా వ్యతిరేకులతో పాటు అన్ని రాజకీయ పార్టీలకు మళ్ళీ గ్రామాలలో స్వేచ్చగా తిరిగే వెసులుబాటు మాత్రము  కలిగించుకున్నారు. తెలంగాణా సాధనలో జరిగిన పచ్చిమోసం ఇది . ఈ మోసాలు కుట్రలు నాలుగు దశాబ్దాలుగా నెత్తురోడుతున్న తెలంగాణాకు ఇది కొత్తకాదు. దీని మూలాలు  తొలిదశ లో జరిగిన ఉద్యమము అప్పుడు జరిగిన ఒప్పందాలు   మళ్ళీ  పునరా వ్రుతమయ్యే  అవకాసం  లేక పోలేదు. నాడు చెన్నారెడ్డి  సారద్యం1969 లో  వెల్లువలా వచ్చిన తెలంగాణా ఉద్రితి తద్వారా  ఆ త్యాగాల పునాదుల మీద రాజకీయ సౌదాలు నిర్మించుకున్న  దుస్టాన్తాలు కోకొల్లలు  ఆక్రమంలో దానికి సమాంతరం గా వచ్చిన  నక్షల్బరి   ఉద్యమం దానికి ఒక సై ద్దాంతిక భూమిక ను ఇచ్చింది  దానిని ఒక ప్రజాస్వామిక  డిమాండ్ గా  మార్చి  దాన్ని ప్రజా ఉద్యమం గా తీర్చిదిద్దారు   , వందల మంది విద్యార్థుల  రక్తతర్పణం తో రాజకీయ  సౌదాన్ని నిర్మించుకున్న   చెన్నారెడ్డి నాయకత్యం చర్చల పేరుతొ కేంద్రం తో చేసుకున్న ఒడంబడిక ఒప్పందాలు  అన్నీ   అవకాశవాద ఒప్పందాలే. ఆనాడు ఉద్యమ కారులకు   కేంద్ర ప్రభుత్వానికి జరగాల్సింది పోగా  అవకాశవాద  రాజకీయ నాయకులకు ప్రయోజనాలు నెరవేర్చే ఒప్పందం గా మారింది.  అదొక అదికార మార్పిడి  తంతుతో బలమయి ప్రజల ఆకాంక్షను పురిట్లోనే పీక నులిమింది తెలంగాణా నాయకత్వం .దాని తదనంతరం ప్రత్యెక ఉదయంలో కీలకం గా పాల్గొన్న విద్యార్థి, మేధో వర్గం ఆ   ఉద్యమ కొనసాగింపు క్రమలోనే అడవి బాట పట్టారనేది   దాచేస్తే దాగని సత్యం.

ఇక  రెండవ దశలో అంటే 1995 గ్రామాలలో  భూమి ఇరుసుగా  సాగిన  నక్షల్బ రీ  ఉద్యమ  ఉద్రితి మూలంగా   అలిసి పోయిన భూస్వామ్య  కమ్మ ,రెడ్డి, వెలమ పెత్తందారి వర్గం ప్రజల  ఆగ్రహాన్ని  తట్టుకోలేక  నగరాల బాట పట్టారు. దొరలు  గ్రామాలను వదిలినపటికీ దోపిడీ రూపం మళ్ళీరాజకీయ ముసుగు వేసుకొని గ్రామాలలో కి ప్రవేశించింది.  ఈ దశలో అది    కాపిటలిస్టు ముసుగులో తెలుగు దేశంతో  కమ్మ వర్గం  , రెడ్డి , మిగతా పెత్తందారీ  శక్తులు   కాంగ్రెస్ తో మమేకమయి రాజకీయాలను కార్పోరేటీకరించారు. వాళ్ళ రాజకీయ ప్రదాన ద్రుష్టి కేంద్ర  రాజకీయాలలో చక్రం తిప్పడం అంతర్జాతీయ  స్తాయిలో వాళ్ళ  రాజకీయ ప్రయో  జనాలను  నిలబెట్టుకోవడం . ఈ దశలో ప్రజలలో ఉన్న తెలంగాణా  ఆకాంక్షను    బలిసిన  కాపిటలిస్టు పూర్తిగా అదిమి పెట్టగలిగింది అయినా  తెలంగాణా జన సభ , తెలంగాణా కళాసమితి , తెలంగాణా ఐక్యవేదిక, తెలంగాణన మహాసభ ,  తెలంగాణా స్టూడెంట్ ఫ్రంట్ గ్రామాలలో చైతన్య యాత్రలను  నిర్మించి ప్రజల   ఆకాంక్షలకు ఒక నిర్మాణాన్ని  ఎర్పరచినప్పటికీ  అప్పటి చంద్రబాబు ప్రభుత్వ ౦   బెల్లి లలిత. ఐలయ్య ను  పాశవికంగా  హత్య చేసి  బయోత్పాతుల్ని  చేసింది . ఇవ్వాళ  తెలంగాణా పేరుతొ  రాజకీయ ముసుగు వేసుకున్న  ఉద్యమ పార్టీలకు ఈ చరిత్ర తెలియంది కాదు .

దీంతో పాటుగా  తర్వాత దశలో కోస్తాంద్ర   కాపిటలిస్టు ముసుగుకు సామ్రాజ్యవాదం తోడయింది  విజన్ 2020 పేరుతొ  సంస్కరణల  ముసుగులో అధికారంలోకి వచ్చిన చంద్ర బాబు  ప్రభుత్వ్యం  బూటకపు  వాగ్దానాలతో కోస్తాంద్ర  కమ్మ పెట్టుబడి దారీ వర్గం సామ్రాజ్య  వాదానికి అంతర్జాతీయ  పెట్టుబడి దార్లకు తలుపులు బార్ల తెరిచింది . తెలంగాణలో  ఉన్న సమస్త వనరులను కోస్తా ఆంద్ర పాలక వర్గం లూటీ చేసింది . తెలంగాణా ఉద్యమం ను  యావత్ నాల్గు కోట్లమంది ఒక జాతీయ విముక్తి పోరాటంగా తీర్చి దిద్ది నప్పటికీ  పెట్టుబడి దారులేపాలక వర్గం  ముసుగు లో ఉండడం మాలంగా విశాల ప్రజా ఉద్యమాన్ని     అణగదొక్కడం వాళ్లకు  అంత కష్టమయిన  విషయం కాలేదు  .దానికోసం కోట్లాది రూపాయలు  చేతులు మారి  శ్రీ కృష్ణ కమిటీ రిపోర్ట్ ను సీమాంద్ర కు అనుకూలంగా  తెప్పించు కున్నారు .

మూడవ దశలో ఆంద్ర  తెలంగాణా  భూస్వామ్య  వర్గం రైతాంగ  సమస్యలను ప్రదాన ఎజండాగా రాజకీయ సమీకరణలు  చేసి పక్క  ప్యూడల్  రాజకీయాలు  నడిపే రాజశేకర్  రెడ్డి  స్తానిక పెత్తందారీ  శక్తులతో కలిసి అధికారం లోకి వస్తే తెలంగాణా ప్రకటిస్తాం అనే భూటకపు  వాగ్దానం  తో అటు తెరాస తో పొత్తు పెట్టుకొని  ఇటు .నక్షల్స్ తో  శాంతి చర్చలు పేరుతొ రాజకీయ నరమేధం సృష్టించాడు. ఎన్నికల ముందు తెలంగాణా కోసం చేసిన వాగ్దానాల లన్నీ   తుంగలో తొక్కాడు  .అధికారం లోకి వచ్చినాక రాజకీయ నరమేధం సృష్టించాడు .ఏనాడు భూమి ఇరుసుగా  ఉద్యమాలు ప్రజల విముక్తి కోసం  నిర్మించారో  అదే భూమిని  అడ్డుపెట్టుకొని  వందల కోట్ల రూపాయలు చేతులు మారే విదంగా రాజకీయాలు నడిపాడు .గడిచిన 5 దశాబ్దాలలో  మారిన రాజకీయ పర్సిస్తితులలో సమస్త సంపద  భూముల రూపంలో ఒనకూర్చుకొని హైదరాబాద్  చుట్టూ తమ రాజకీయ ఆర్ధిక సౌదాలను  నిర్మించుకున్నారు. నేడు  తెలంగాణా రాష్ట్ర  సాదన ప్రక్రియలో ప్రాదాన అడ్దంకి సంపద అంతా వనరుల రూపంలో ఉండడమే. దీని చుట్టూ ఉన్న సంపద కు   తెలంగాణలో ఇప్పటికీ రాజీనామా చేయని తెలంగాణా పెట్టుబడి దారీ వర్గం కోస్తంద్ర  పెట్టుబడి దారులకు  కష్టో డియన్ లు గా వ్యవహరిస్తున్నారు .ఈవాళ తెలంగాణా ప్రకటనకు  కు   ప్రదాన అడ్దంకి మూడు  ప్రాంతాల దానం,  ముకేష్ లాంటి  సంపన్న శ్రేణి వర్గం . ఈ సంపన్న శ్రేణి మేడలు  వంచాలని కోరుకుంటున్న  ప్రత్యెక తెలంగాణా వాదులు , సామాజిక తెలంగాణా  మరియు ప్రజాస్వామిక తెలంగాణా వాదులు ఒక తాటి మీదకు వచ్చి ఉద్యమ కార్యాచరణ  నిర్మించడం లో వైఫ్యల్యం  చెందారు

.నేడు మలివిడత తెలంగాణా పోరాటం విద్యార్థుల త్యాగాల పునాదుల మీదుగా సాదించిన  డిసెంబర్ ప్రకటన,  చిదంబరం మలి ప్రకటన మరింత సంస్క్షోభం లోకి నెట్టింది   సీమాంద్ర  పెట్టుబడి దారుల ముందు తెలంగాణా ప్రజాప్రతినిదుల రాజీనామాలు నిలబడ లేక పోయాయి రాజీనామాల ద్వారానే రాష్ట్రం  సంక్రమిస్త ది అనుకుంటే ఈ పాటికి ప్రకటన వచ్చ్చి ఉండాలి .   సామాజిక తెలంగాణా కోరుకొనే శక్తులన్నే
ఉత్పత్తి శక్తులను ఐక్యం చేయడం లో ఉద్యమ సంఘాలు, మేధో వర్గం  దారుణంగా వైఫల్యం చెందాయి.

ఉత్పత్తి శక్తుల అనైక్యత వల్ల వాళ్ళను   పైన  పేర్కొన్న మూడు ఉద్యమ స్రవంతులు, రాజీనామాలు చేసిన ప్రజా ప్రతినిదులు  కలిసి ఐక్య సంఘటన ఇంకా ఏర్పాటు చేయక పోవడం ప్రస్తుత ఉద్యమ  ప్రదాన లోపం.   ఉద్యమ , ఉద్యోగ , ప్రజాసంఘాలకు, పోలిటికల్ జాక్ ల మద్య సమన్వయ లోపం మాత్రమె ఈ స్థితి కి కారణం.  .ఇక్యతా పోరాటం స్పూర్తితో  విద్యార్ధి ,ఉద్యోగ, ప్రజాసంఘాలు ఐక్య సంఘటనతో  ప్రజాపోరాటాలను తీవ్రతరం చేయడం ద్వారా మాత్రమె తెలంగాణా విముక్తి కలిగించిన వాళ్ళ మవుతాం .

                                                                                                                                                                             గుర్రం సీతారాములు
                                                                                              డాక్టోరల్ ఫెలో ,ఇంగ్లీష్ అండ్ ఫారిన్  లాంగ్వేజెస్ యూనివెర్సిటీ .

మా దేహం ముక్కలయినా ఈ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వం అన్న,పయ్యావుల కేశవ్ మరయు  T జి వెంకటేష్ లాంటి వాళ్ళకు ఇంకా ఈ రాష్ట్రం ను ఉమ్మడిగా ఉంచి.ఈ ప్రాంతం మీద యదేచ్చగా తమ దోపిడీని  కొన సాగించు కోవచ్చ్చు అనేబరోసా  ఉండి  ఉండవచ్చు ఎందుకంటె రాళ్ళ సీమలో దలకోట్లు సంపాదించిన వీళ్ళకు రాష్ట్రం విడిపోతే దోపిడీ కి అడ్డుకట్ట పడుతుంది అనుకుంటున్నారు . మీన మీసాలు లెక్కపెడుతున్న కేంద్రం కు  వందలాది మంది అమాయకుల బలిదానాలు కళ్లకు కనిపించటం లేదు, వందల ఏళ్ళుగా  హస్తినకు అధికారం నిలుపుకోవడాని రక్తాన్ని ఏరులు పారించినచరిత్ర ఉంది ఆ పరంపరలోనే  UPA నేడు పనిచేస్తోంది .ఎందుకంటె ఆదిపత్యం నిలుపుకోవడాని ఆదిపత్య సమాజాలు సమూహాలు  చేసిన ఆగడాలు లేక్కేలేనివి, ఆ తీరని రఖ్త దాహమే నేడు ఆరు వందల మంది ని బలి తీసుకుంది .నిన్న  పయ్యావుల కేశవ్  చేసిన వ్యాక్యాలు మొన్న T జి వెంకటేష్  ఉస్మానియా , కాకతీయ విశ్వవిద్యాలయాలలో సంగ విద్రోహ శక్తులు ఉన్నాయి అనడం ఇక్కడి ప్రజల ఆత్మాభిమనాలను దెబ్బ తీయడమే  ఎందుకంటె  డబ్బు సంచులతో రాయలసీమ ముటాలను వెంట పెట్టుకొని రాజకీయం నడిపే వీళ్ళకు త్యాగాల విలువ ఏం తెలుస్తుంది ,నిరాశా  నిస్పృహ లతో ఉన్న విద్యార్ధి లోకాన్ని , గాయపర్చదానికే మాత్రమె వీళ్ళు అల్లా మాట్లాడుతున్నారు ఆ క్రమంలోనే  అమరుడు యాదిరెడ్డి  తెలంగాణా కోసం దేశ రాజదాని  నడిబొడ్డున బలిదానం చేసుకుంటే ఆత్మాహుతి దాడులకు సిద్దపడి అయినా రాష్ట్ర విభజన  అడ్డుకుంటాం అనటం అహం కారపురితమయిన  యెంత వరకు సమంజసం ? ప్రజా ప్రతినిదులుగా  కొనసాగే అర్హత వీళ్ళకు ఉందా? వీళ్ళకు తెలిసింది ఒకటే  ఇంతకాలం యదేచ్చగాక  కొన సాగిన దోపిడీ రాష్ట్రం విడిపోతే సాగదని . అయినా  రాయలసీమ లో ముటాలు  కట్టినంత తేలిక కాదు తెలంగాణా నెత్తుటి పోరాటం అర్థం కావడానికి  ఒళ్ళు కొవ్వు ఎక్కి డబ్బు మద అహంకారం తో ముటా రౌడీలా ఈ నేల గురించి మాట్లాడేది ? ఇక్కడ పసిపిల్లలను అడుగు  చెప్తారు రాణీ రుద్రమ శౌర్యాన్ని, బందగీ కొమరయ్యల త్యాగాన్ని..వాటిని  స్తన్యంగా తాగిన వాళ్ళు , ఈ నేల విముక్తి కోసం వందల మంది జీవితాలను విముక్తి చేసుకున్నారు  తెలంగాణా ఎలా సాదించు కోవాలో ఈ నేల మీద పుట్టిన వాళ్లకు తెలుసు  సీమంద్ర పిరికి పందలనుండి ఇలాంటి ఆహంకార మయిన ప్రకటన రావడం కొత్తకాదు . కొన్ని వందల ఏళ్ళనుండి ప్రతి  ఘటన  ప్రాణం గా దిక్కారనే.ఊపరిగా బ్రతికిన ఇక్కడి సంస్కృతినీ  త్యాగాన్ని బలిదానాలనూ   ఈ ప్రాంతాన్ని తక్కువగ్గా చేసి చూపడమే చూపడం వాళ్ళ లక్ష్యం . వాటిని ఉపసంహ రించుకోకుంటే  జరిగే తీవ్ర పరిణామాలకు అతనే బాద్త్యత వహించాల్సింది అని విద్యార్థులు తరపున హెచ్చరిస్తున్నాం .సీమంద్ర డబ్బు మూటలకు  తెలంగాణా కొంత కాలం అగోచ్చేమో కాని 4 కోట్ల మంది తెగించి వీదుల్లో సమరశీల పోరాటాలకు సిద్దపడుతున్నారు .రేపటి ఉద్యోగుల సార్వత్రిక సహాయ  నిరాకరణ కేంద్ర రాష్ట్ర  దిమ్మ  తిరగాలి ..చివరగా  ఈ ప్రాంత ప్రజల కలల సాకారం సొంత రాష్ట్ర  కల నిజం  కావడానికి  ఇక ఎంతో దూరం లేదు  అంతిమంగా తెలంగాణా ప్రజలే తమ విముక్తిని తామే ప్రకటించుకుంటారు .

Follow

Get every new post delivered to your Inbox.